తల్లిదండ్రులను విస్మరించేవారు శిక్షార్హులే

కోరుట్ల ఆర్డీవో సోమ రాజేశ్వర్
సిరా న్యూస్,జగిత్యాల;
వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని,వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని కోరుట్ల ఆర్డీవో సోమ రాజేశ్వర్ అన్నారు.శుక్రవారం జిల్లా లోని కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ బొమ్మెన గ్రామ శాఖ ఆధ్వర్యంలో వయో వృద్ధుల సంక్షేమ,రక్షణ చట్టం పై అవగాహన సదస్సు,బొమ్మెన గ్రామ సీనియర్ సిటిజెన్ల అస్సోసియేషన్ శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలోముఖ్య అతిథులుగా కోరుట్ల ఆర్డీవో సోమ రాజేశ్వర్, సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఆర్డీవో మాట్లాడుతూ వయో వృద్ధుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 14567 ఉందని ,వారిని నిరాదరిస్తున్న,వేధిస్తున్న వారిపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు.వేధింపులకు గురి చేసిన వారికి వయో వృద్ధుల సంరక్షణ చట్టం 2007 ప్రకారం 3 నెలల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా విధించే వీలుందన్నారు.సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏకయిక సీనియర్ సిటీజేన్స్ అస్సోసియేషన్ తమదేనన్నారు. తమ అస్సోసియేషన్ ప్రతినిధులు జిల్లాలో వయోవృద్దుల సంరక్షణ చట్టం అమలులో ప్రభుత్వం కు సహకరిస్తూ తల్లిదండ్రులను నిరాదరిస్తున్న కొడుకులు,కూతుర్లు,కోడళ్లకు కౌన్సెలింగ్ లు చేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. .ఆదర్శ ప్రజా ఆర్డీవో గా కోరుట్ల ఆర్డీవో కొద్ది కాలానికే పేరు తెచ్చికున్నారని,
వయోధికుల కేసుల పరిష్కారం లో నెంబర్ వన్ గా నిలిచారని కొనియాడారు..గతంలో కోరుట్ల,కతలాపూర్,మేడి పల్లి మండలాల్లో పరిష్కారం అయిన కేసులను వివరించారు.ఇటీవల వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 నియమావళి 2011 లో సవరణలకు తమ రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహ రావు అభ్యర్థన మేరకు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వృద్ధులకు మరింత భరోసా కల్పించేందుకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,తహసీల్దార్ ముంటాజోద్దీన్,ఎం.పి.డి.ఓ.జనార్దన్,జిల్లా సీనియర్ సిటీజేన్స్ ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వి.ప్రకాష్ రావు,ఉపాధ్యక్షులు పి.సి.హన్మంత్ రెడ్డి, ,ఎం.డి.యాకూబ్, జగిత్యాల పట్టణ అధ్యక్షుడు సతీష్ రాజ్,కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం
,ఉపాధ్యక్షుడు ఎం.డి.సైఫోద్దీన్,
రాజయ్య, కథలపూర్,మండల బొమ్మెన గ్రామ అధ్యక్షుడు అల్లూరి బాపు రెడ్డి,కార్యదర్శి అల్లూరి దేవారెడ్డి, సీనియర్ సిటీజేన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *