నాచారం డీపీఎస్ కు మూడు అవార్డులు

 సిరా న్యూస్,రంగారెడ్డి;
నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (కేంబ్రిడ్జ్ ఇంటర్నేషన్ కరిక్యులమ్)కు ప్రతిష్టాత్మక మూడు అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా స్కూల్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీత రావు మాట్లాడుతూ.. ఈ అవార్డులు తమకెంతో ఆనందంగా, ప్రోత్సాహాన్ని అందించాయన్నారు. ఫిబ్రవరి 15న జరిగిన కేంబ్రిడ్జ్ స్కూల్ కాంక్లేవ్ – సౌత్ ఏషియా, ఎక్సలెన్స్ రికగ్నిషన్ అవార్డ్స్ వేడుకలో నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మూడు అవార్డులను అందుకుందన్నారు.
గత దశాబ్ద కాలంగా నిబద్ధత, అంకితభావంతో విద్యను అందిస్తున్న ఈ స్కూల్ కు ‘ది ఇన్నోవేటివ్ టీచింగ్ ఎక్సలెన్స్ అవార్డు’ అలాగే రెండో అవార్డైన ‘బెస్ట్ కేంబ్రిడ్జ్ స్కూల్ ఫర్ ఎర్లీ ఇయర్స్ ఎడ్యుకేషన్’ మూడో అవార్డైన ‘ది అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డు-సౌత్ ఏషియా’ లు వచ్చాయని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక మూడు అవార్డులు.. స్కూల్ యాజమాన్య నిబద్ధత, ఉపాధ్యాయుల అంకిత భావం, విద్యార్థులకోసం రూపొందిస్తున్న పరిశోధనాత్మక కరిక్యులమ్, హై స్టాండర్డ్స్ కు గుర్తింపుగా లభించాయని సునీత రావు అన్నారు.
విద్యను అందించడంలో డైరెక్టర్ మల్కా పల్లవి, సీఈఓ మల్కా యశస్వి, సీనియర్ ప్రిన్సిపల్ సునీత రావు సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఎస్ ఎఫ్ శాంతి ఆంథోనీలు ఎప్పుడూ కొత్త ఒరవడికి నాంది పలుకుతుంటారని, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని డిపిస్ చైర్మన్ మల్కా కొమరయ్య తెలిపారు. యంగ్ మైండ్స్ ని దశలవారీగా అద్భుతంగా తీర్చిదిద్దుతున్న పాఠశాల సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ విజయంలో విద్యార్థుల కోసం కృషి చేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడి పాత్ర ఉందన్నారు. భవిష్యత్ లో తాము మరింత బాధ్యతగా, అంకితభావంతో విద్యార్థుల కోసం పని చేస్తామని హామీ ఇచ్చారు.
===============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *