సిరా న్యూస్,హైదరాబాద్;
సనత్ నగర్ జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సి అపార్ట్మెంట్ రెండవ అంతస్తులో గల 204 ఫ్లాట్ లో విద్యుదాఘాతంతో ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఇంట్లోని బాత్రూంలో మృతదేహాలను కాలనీవాసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు ఆర్. వెంకటేష్ (55), మాధవి (50), హరి(30)గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.