సిరా న్యూస్,మెదక్;
మెదక్ జిల్లా 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొట్టడంతో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ముందు వెళ్తున్న ఒక వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ట్రాక్టర్, ఆటో, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మాసాయిపేట గ్రామానికి చెందిన దుంపల అశోక్, సాకలి బిక్షపతి అనే ఇద్దరికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు దీంతో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.