సిరాన్యూస్, సిరికొండ
జిల్లా బీజేవైఎం అధ్యక్షుడి రేసులో తుకారాం
గతంలో ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న పాయల్ శంకర్ ఇటీవలే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్న పతంగి బ్రహ్మానందంను బీజేపీ అధిష్టానం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. దీంతో బీజేవైఎం జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంతో పలువురు బిజెపి నాయకులు జిల్లా బీజేవైఎం అధ్యక్షుడి పదవి రేసులో ఉన్నారు. కాగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాంపూర్ (బి) గ్రామానికి చెందిన బీజేపీ యువ నాయకులు, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు, బిజెపి మండల ఉపాధ్యక్షుడు బోయర్ తుకారాం జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు పదవి రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఈయన పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.