సిరాన్యూస్, బోథ్
బీఆర్ ఎస్ హయాంలో గ్రామాల అభివృద్ధి : ఎంపీపీ తుల శ్రీనివాస్
బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు.సోమవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సోనాల, టివిటి , పరుపులపల్లె, నాగపూర్ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన ఉపాధి హామీ కూలీలు చేపడుతున్న ప్రాంతానికి వెళ్లి వారిని ఓట్లు అడగడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం జరిగిందని ఓటర్లకు వివరించారు. చేతకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ నారాయణరెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, నాగపూర్ మాజీ సర్పంచ్ పోవా, సుమిత్ర భీమ్రావు, రమేష్, సురేష్ , దేవిదాస్, గోపాల్, బోథ్ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఆత్మ మాజీ చైర్మన్ మల్లెపూల సుభాష్ బాబు సింగ్, సురేందర్ సోలంకి సత్యనారాయణ, రమేష్ హరీష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.