Thummala Arundhati : చిత్త శుద్ధితో ప‌ని చేస్తున్న‌ ప్ర‌భుత్వం

సిరా న్యూస్, జైన‌థ్‌
చిత్త శుద్ధితో ప‌ని చేస్తున్న‌ ప్ర‌భుత్వం
* జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి
* అభివృద్ధి ప‌నుల‌కు భూమి

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమం కోసం చిత్త శుద్ధితో ప‌ని చేస్తుంద‌ని జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్ర‌వారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లోని అకోలి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 3 లక్షలు,మాండగడ గ్రామంలో 10 లక్షలు,  పెండల్ వాడ గ్రామంలో 14 లక్షల రూపాయల నిధులతో చేప‌ట్టే అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.టెంకాయ కొట్టి శంఖుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ ఆశ‌లు, ఆశ‌యాల‌క‌నుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ మంచి ప్ర‌జాపాల‌న సాగిస్తూ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని చూర‌గొంద‌ని అన్నారు.  కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,అల్లూరి భూమ రెడ్డి,యాల్ల పోతా రెడ్డి,బాయిన్ వార్ గంగా రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మునిగేల విట్టల్, దీపక్ రావ్, మాజీ సర్పంచ్ పోసాని, నర్ర విట్టల్, సైపట్ మహేందర్ రావు, మామిడి వెంకట్ రెడ్డి, తన్వీర్, జంగిలి సురేష్, తుమ్మల మహేందర్ రెడ్డి, నూతుల దయాకర్ రెడ్డి, వసంత్ పలువురు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *