సిరాన్యూస్, గుడిహాత్నూర్:
గుడిహాత్నూర్ లో చిరుత పులి కలకలం..
+ ఆవుపై దాడి చేసి చంపేసిన చిరుత
+ భయాందోళనలో గ్రామస్తులు
ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూర్ మండలం ధమన్ గూడ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత పులి ఆవు పై దాడి చేసి చంపేసిన ఘటన కలకలం రేపుతోంది. మనేకర్ కృష్ణ అనే రైతు కి చెందిన ఆవుపై చిరుత దాడి చేసి చంపేయడంతో, గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. చిరుత సంచారం పై గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.