సిరా న్యూస్, చిగురుమామిడి
ఉచిత కంటి వైద్య సేవల్ని సద్వినియోగం చేసుకోవాలి : వైద్యులు తిప్పారపు శ్రీనివాస్
శ్రీనివాస విజన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సామాజికవేత్త కంటి వైద్యులు తిప్పారపు శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో శ్రీనివాస విజన్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ప్రతి బుధ ,ఆదివారంలో ఉచిత వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఇప్పటివరకు 114 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అందులో 31 మందికి కంటిపోరలు ఉన్నట్లు గుర్తించమని వారిని ఉచిత కంటి ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్ లోని పుష్పగిరి కంటి ఆసుపత్రికి ఉచిత ప్రత్యేక వాహనంలో పంపిస్తామని తెలిపారు. ఇప్పటివరకు 2100 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయుoచినట్టు తెలిపారు. ఇలాంటి కంటి సమస్యలు ఉన్న శ్రీనివాస విజన్ సెంటర్ ను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కంటి పరీక్ష నిపుణులు అన్నారం సౌజన్య , కోరుకంటి సారయ్య ,మంద సతీష్ , సదానందం,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.