సిరా న్యూస్,తిరుపతి;
తిరుచానూరులొ వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కరోల్ బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో రమేష్, సూపరింటెండెంట్ మధు, ఏవిఎస్వో సతీష్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు