శ్రీవారిని దర్శించుకున్న తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ….తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుతామన్నారు. తిరుపతి అభివృద్ది పై పవన్ కళ్యాణ్,చంద్రబాబుకి అవగాహన వుందని తెలిపారు. వారి సహకారంతో తిరుపతిని అభివృద్ది పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు
==========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *