సిరాన్యూస్, భీమదేవరపల్లి
ముల్కనూర్ గ్రంథాలయాన్ని సందర్శించిన ఈఎఫ్ఎల్ యూ ప్రొఫెసర్
భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలోని గ్రంథాలయాన్నిసోమవారం ఈఎఫ్ఎల్యు ప్రొఫెసర్ జన్నారపు తిరుపతి కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న గ్రామంలో పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పర్చి, సమర్థవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. సరస్వతి, మహాత్మ జ్యోతిరావు సావిత్రిబాయి పూలే , పడాల చంద్రయ్య విగ్రహాలన్నీ ఏర్పాటు చేసినందుకు గ్రంథాలయ సిబ్బందిని కొనియాడారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులను కావాల్సిన పుస్తకాలు ఇతర సామాగ్రి నియమితం 10,000 రూపాయలను విరాళం అందించారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధ్యక్షులు మాజీ జెడ్పిటిసి వంగ రవి, డాక్టర్ ఎద్దుల పురం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.