Tirupati Reddy:ఉన్న ఊరు కన్నతల్లి తో సమానం

సిరా న్యూస్, భీమదేవరపల్లి
ఉన్న ఊరు కన్నతల్లి తో సమానం
* అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి
* సొంత ఖర్చులతో గ్రామం అభివృద్ధిలో తన వంతు
* ఆద‌ర్శంగా నిలుస్తున్న గూడెల్లి తిరుపతిరెడ్డి
ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అని భావించిన గూడెల్లి వెంకటరెడ్డి కుమారుడు గూడెల్లి తిరుపతిరెడ్డి గ్రామ అభివృద్ధి కోసం చేయుతగా తనవంతు సహాయం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. భీమదేవరపల్లి మండలంలోని మల్లారం గ్రామంలో గూడెల్లి తిరుపతిరెడ్డి కొంత వ్యయంతో గ్రామస్తులకు, బాటసారులకు ఉపయోగపడేలా బెంచీలు వేయించాడు. రెండు లక్షల రూపాయలతో గ్రామానికి స్వర్గ రథం, గ్రామ శివారులోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా, సిసి రోడ్డుతో పాటు గుడి ప్రాంగణంలో ప్రహడి గోడ సుమారు రెండు లక్షల వ్యయంతో నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు.అలాగే గ్రామంలోని స్మశాన వాటికలో 1లక్ష 50 వేయిల రూపాయలతో దహన సమస్కారాలు పూర్తి అయిన తరువాత స్నానాల నిమిత్తం, బోరుతో పాటు, మహిళలకు బట్టలు మార్చుకోవటం కోసం గదులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కార్యక్రమం తన తండ్రి గూడెల్లి వెంకటరెడ్డి జ్ఞాపకార్థం చేయడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉన్నవారు కన్నతల్లితో సమానం అని భావించి, తన వంతు సహాయంగా అందించి, గ్రామ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.

గ్రామ అభివృద్ధికి పాటుపడటం గర్వకారణం… (పెద్ది శివ కుమార్, మల్లారం గ్రామస్థులు)
గూడెల్లి వెంకటరెడ్డి కుమారుడు గూడెల్లి తిరుపతిరెడ్డి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడటం గర్వంగా ఉంద‌ని తెలిపారు.వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా గ్రామ అభివృద్ధి కోసం పలువురు సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *