ప్రతిభ హై స్కూల్ యాజమాన్యం దూద్ భాష
సిరా న్యూస్,కౌతాళం;
ఉపాధ్యాయుని ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలకు మంచి విద్య అందించగలరని వారికి మంచి సలహాలు అందించగలరని ప్రతిభ హై స్కూల్ దూద్ భాషా పేర్కొన్నారు.
మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రతిభా హైస్కూల్లో గురువారం అపోలో డయాగ్నొస్టిక్
ఆదోని సెంటర్ వారు మహిళలకు కొన్ని రక్త పరీక్షలను అతి తక్కువ ధరలకు చేయడం జరిగింది సెక్రటరీ సయ్యద్ మైలుద్దీన్ ఆధ్వర్యంలో 50% యాజమాన్యం భరించి ఉపాధ్యాయినీలకు, , రక్త పరీక్షలను చేయించడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఉపాధ్యాయులందరూ ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలకు మంచి విద్యను అందించగలరని మా పాఠశాల తరఫున ఉపాధ్యాయులకు అత్యవసర పరిస్థితులలో ఎల్లప్పుడూ సహకారంగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానేశ్వరి,, ప్రేక్షకులు జయలక్ష్మి,, శిరీష మహిళ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
==========================