ఈరోజు దేశ వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన రోజు…

-నేడు మండల్ డే
-బీసీల ఆరాధ్యులు బీ.పి మండల్, మాజీ ప్రధాని వి.పి.సింగ్ లు

సిరా న్యూస్;
ఆగస్టు, 7, 1990 సoవత్సరం రోజున… మన భారతదేశంలో మొదటి సారి బీసీలకు విద్య, ఉద్యోగలలో 27%రిజర్వేషన్లు ప్రాసాధించిన మాజీ ప్రధాని వి.పి. సింగ్ ,రిజర్వేషన్లకు ఆద్యుడయి నటువంటి బిందెశ్వర్ ప్రసాద్(బి పి మండల్)లకు వెనుకబడిన కులాలకు చెందిన మనమంతా ఋణపడి ఉండాలి.
వారి గురించి తెలుసుకుందాం:
బిందేశ్వరి ప్రసాద్ మండల్(1918–1982) భారతదేశ పార్లమెంటు సభ్యుడు, సంఘ సంస్కర్త. అతను రెండవ వెనుకబడిన తరగతుల కమీషన్ (మండల్ కమీషన్ గా సుపరిచితం) కు చైర్మన్ గా వ్యవహరించాడు. అతను ఉత్తర బీహార్ లోణి సహర్సా లో అత్యంత ధనుకులైన యాదవ్ జమీందారీ (భూస్వాములు) కుటుంబం లో జన్మించాడు. కమీషన్ భారతదేశంలోని ప్రజలలో ఒక భాగాన్ని “అదర్ బేక్ వర్డ్ క్లాసెస్” (ఇతర వెనుకబడిన కులాలు) గా నివేదిక ప్రకారం నివేదించింది. భారతీయ రాజకీయాల్లో తక్కువగా ఉన్న, బలహీన వర్గాల కోసం పాలసీపై తీవ్రమైన చర్చ ప్రారంభమైంది.

విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (జూన్ 25, 1931 – నవంబరు 27, 2008), భారతీయ రాజకీయ నాయకుడు, భారతదేశ ఏడవ ప్రధానమంత్రిగా 1989 నుండి 1990 వరకు పనిచేసాడు. మండల్ కమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన కులాలకు 27% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిన ప్రధాని.

మండల్ కమిషన్ నివేదిక:
మండల్ కమిషన్ భారతదేశంలోని సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితులని అధ్యయనం చేసే కమీషన్. దీనిని 1979 జనవరి 1 న అప్పటి జనతాపార్టీ కి చెందిన భారత ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ చే ప్రారంభించబడినది. ఆ కాలంలో ఏర్పాటు చేసిన కమిషన్ ఛైర్మన్ గా బి.పి.మండల్ వ్యవహరించాడు. అతను రూపొందించిన మండల్ కమిషన్ నివేదిక భారత దేశంలో వెనుక బడిన తరగతులు, యితర వెనుక బడిన తరగతులు గా సూచించబడిన కులాలకు సామాన్య జన స్రవంతిలో అనుసంధానం చేసే మార్గాలను అధ్యయనం చేసి క్రమ బద్ధము, న్యాయ బద్ధమూ అయిన విధాన నిర్మాణాన్ని ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ఆ సమయానికి మురార్జీ దేశాయి ప్రధాని పదవినుండి వైదొలగ వలసి వచ్చింది. తరువాత కాంగ్రెస్ పాలనలో సుమారు 10 సంవత్సరాలు మండల్ కమీషన్ నివేదిక బుట్ట దాఖలు అయిపోయింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం పతనమై వి.పి. సింగ్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మండల్ కమీషన్ నివేదికకు తన ప్రభుత్వ ఆమోద ముద్ర వేసాడు.ఈ నిర్ణయం ఉత్తర భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలోని ఉన్నత కులాలకు చెందిన యువత నుండి విస్తృతమైన నిరసనలకు దారితీసింది. దాని ఫలితంగా దేశంలో రేగిన కల్లోలం మూలంగా, స్వయాన వి.పి. సింగ్ తన రాజకీయ జీవతాన్నే మూల్యంగా చెల్లించవలసి వచ్చింది.
ఓబిసి రిజర్వేషన్లను (క్రిమీలేయర్ కంటే దిగువన) 2008 లో సుప్రీం కోర్టు సమర్థించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *