నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

సిరా న్యూస్;

పొగతాగడం ఆరోగ్యానికి హానికరం. ప్రతీ సినిమా మొదలయ్యే ముందు వచ్చే ఈ మాటలు విని ఎంత మంది పొగ మానేస్తారో అర్థం కాదు. పొగ తాగడం వల్ల హానికరం అని తెలిసి కూడా మానలేకపోతున్నవారు చాలామందే ఉన్నారు.ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మే 31న ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సమావేశంలో 1988, ఏప్రిల్ 7న ధూమపాన రహిత దినోత్సవం గా పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగదారులను ఏప్రిల్ 7వ తేదీన 24 గంటలపాటు పొగాకు ఉత్పత్తులను వాడకుండా ఉండమని కోరింది. దానిని అనుసరించి 1988లో జరిగిన సమావేశంలో ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికం. పొగాకు శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లి ఎంఫసియా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ ఫల్మనరీ డిసీజ్‌ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. గొంతు కేన్సర్‌, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పీల్చేవారికీ కూడా ప్రమాదమే. పొగాకు వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేయడంకోసం అవగహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.ఈ అవగాహన కార్యక్రమాల ఫలితంగా భారతదేశంలో పొగతాగే వారి సంఖ్య 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గింది.
28తాగునీటికోసం గ్రామస్థుల అందోళన
జూలూరుపాడు
తాగునీటి ఎద్దడిని తీర్చాలని కోరుతూ రాస్తారోకో వినోబా నగర్ లో నెల రోజులుగా తాగునీటి సరఫరా కాకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు మండిపడ్డారు. చివరకు పోలీసుల హామీతో ఆందోళన విరమించారు. గత నెల రోజులుగా గ్రామంలో తాగునీరు సరఫరా కాకపోవటంతో ప్రజలు అగ్రహం చెంది రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గ్రామంలో మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకును నిర్మించినప్పటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవటంతో అది అలంకారప్రాయంగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ ద్వారా నీటి సరఫరా చేస్తున్నప్పటికీ నెలరోజులుగా గ్రామంలో నేటి సరఫరా నిలిచిపోయింది.
నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఖాళీ బిందెలతో రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ జీవన్ రాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకాలకు నచ్చజెప్పి ధర్నను విరవింపచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *