నేడు ప్రపంచ చిత్తడినేలల దినోత్సవం

సిరా న్యూస్;

చిత్తడినేలలు అనే పదం విన్నవారే తక్కువ . ఇక ఆ చిత్తడినేలల ప్రాముఖ్య గురించి తెలిసిన వారు బహు తక్కువ . దాను ఫలితమే అతి వేగంగా అంతరించిపోతున్న చిత్తడినేలలు , భౌగోళికపరంగా , జీవ వైవిధ్య పరంగా చిత్తడినేలలు ఎంతో కీలకమైనవి . సముదర తీరప్రాంతాలలొనైనా , నదుల ప్రాంతాలలొనైనా సంవత్సరం లో అధిక కాలము నీరు నిలిచివుండి , తోతు తక్కువగా ఉండే ప్రదేశాలను చిత్తడి నేలలు గా పిలుస్తారు . మంచినీటి , ఉప్పునీటి సరస్సులు , మడ అడవులలు కలిగిన సాగర సంగమ ప్రాంతాలు , బురద కయ్యలు , ఉప్పునీటి కయ్యలు , ప్రవాహాలు కలిగిన ప్రాంతాలు వంటివన్నీ చిత్తడి నేలల కిందకే వస్తాయి .

జలవనరులు మానవాళి మనుగడకు ఎంతో కీలకం . అందుకే మానవ సంస్కృతి నదీ తీరాలలోనే విలసిల్లినది . సింధు , గంగానది , కృష్ణానదీ , గోదావరీ నదీతీరాలలోనే విలసిల్లినది . నేడు మహానగరములు గా భాసిల్లుతున్న కలకత్తా , ముంబయి , చెన్నై , టొకియో, న్యూయార్క్ వంటివన్నీ జలవనరుల ఆధారముగా ఎదిగినవే , అన్ని దిక్కులనుండి అక్కడికి ప్రజలను ఆకర్షించడానికి మూలము ఆ నగరాల ఆర్ధికసంపద అయితే , ఆ ఆర్ధిక సంపదను అందించినది ఆ ప్రాంతాలలో ఉన్న చిత్తడి నేలలే . ఒక ప్రాంత ఆర్ధికవ్యవస్థలో చిత్తడి నేలలు కీలక పాత్ర వహిస్తాయి.
సముద్రతీరం లో ఉన్న చిత్తడినేలలు ఆ ప్రదేశానికి స్థిరత్వాన్నిస్తాయి . అలల తాకిడికి ఆ ప్రాంతం దెబ్బతినకుండా రక్షిస్తాయి . నదులప్రాంతం లో అయితే చిత్తడినేలలు వరదముంపుల నుండి రక్షిస్తాయి . చిత్తడినేలలు అనేక వందల రకాల మొక్కలు , జంతువులకు మెరుగైన ఆశ్రయాన్నిస్తాయి .

చేపలు , రొయ్యలు వంటి అనేక నీటిజాతులకు గుడ్లు పెట్టేందుకు , పిల్లలు ఎదిగేందుకు సౌకర్యము కల్పిస్తాయి . ఆయా ప్రాంతాలలో ఉండే నీటి నాణ్యతను పెంచడంలోనూ చిత్తదినేలలు పాత్ర వహిస్తాయి. ఆ ప్రదేశాలలోకి వదలబడిన కాలుష్యకారకాలను గ్రహిస్తాయి. ఇన్ని లాభాల్ని అందించే చిత్తడి నేలల విలువను డబ్బు రూపం లో లెక్కకడితే కొన్ని లక్షలకోట్ల రూపాయల్లో ఉంటుంది . నీటికి , భూమికి అనుసంధాన ప్రాంతంగా ఉండే ఈ చిత్తడినేలల ప్రాముఖ్యతను అర్ధము చేసుకోలేకపోయిన ప్రజలు తమ ఆవాసాల విస్తరణలో చిత్తడి నేలలను మింగేయసాగారు . ముంబయి నగరం ఈ స్థాయికి విస్తరించిందంటే దానివెనక మాయమయిన చిత్తడి నేలలనేకము ఉన్నాయి . చిత్తడి నేలలు ఆక్రమించి , మట్టితో కప్పి తమ భవన నిర్మాణానికి వాడుకోవడం మొదలు పెట్టేరు . ఒకప్పుడు చిత్తడి నేల ఆడవులుగా ఉన్న ముంబయి ప్రాంతం లో నేడు కాంక్రీటు భవనాలు నిలిచాయి . ఇది కేవలము మనదేశానికి సంబంధిన సమస్యకాదు . ప్రపంచవ్యాప్తం గా పారిశ్రామిక అభివృద్ధితో తరిగిపోతున్న చిత్త్డినేలలను గుర్తించి అంతర్జాతీయ వేదిక ఒక ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేసింది .

1971 ఫిబ్రవరి 02 న చిత్తడి నేలల మీద ప్రపంచ దృష్టి మళ్ళించే సదస్సు ఇరాన్‌ దేశములో రామ్‌సార్ పట్టణములో జరిగింది . కాస్పియన్‌ సముద్రతీరం మీదున్న అ రామ్‌సార్ జరిపిన చర్చల ఫలితం గా ప్రపంచం లోని దేశాలన్నీ తమ తమ దేశాల్లోని కీలక చిత్తడి నేలలను గుర్తించి వాటి పరిరక్షణ కు అవసరమైన చర్యలు చేపట్టాలని తీర్మాణము చేసారు . ప్రత్యేక చట్టాలతో వాటిని రక్షించాల్సిన భాద్యత ప్రభుత్వాలపైన పెట్టింది . అయినా చిత్తడి నేలల మీద దృస్టి 1997 వరకు కేంద్రీకరించబడలేదు .

తొలిసారిగా ప్రపంచ చిత్తడినేలల దినోత్సవాన్ని 1997 లో ఫిబ్రవరి 02 న జరిపారు . నాటి నుండి ప్రతియేటా ఈ దినోత్సవం జరుగుతోంది . ఒక్కొక్క సంవత్సరము ఒక కొత్త అంశం మీద దృష్టి పెడుతూ ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు . గత సంవత్సరము ” చిత్తడి నేల జీవవైవిధ్యం , వాతావరణం , ఉష్ణోగ్రత మార్పుల్ని పరిరక్షించడం ” అనే అంశ ను పరిగణలోనికి తీసుకున్నారు.
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *