TPUS: ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి -టీపీయూఎస్‌

సిరా న్యూస్, బజార్‌హ‌త్నూర్
ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలిటీపీయూఎస్‌
* బజార్‌హ‌త్నూర్ టీపీయూఎస్‌ మండల కార్యవర్గం ఎన్నిక‌

టెట్ సంబంధం లేకుండా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని టీపీయూఎస్‌ జిల్లా అధ్యక్షులు సునీల్ చవాన్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బజార్‌హ‌త్నూర్ టీపీయూఎస్‌ మండల కార్యవర్గ సమా వేశం జిల్లా అధ్యక్షులు సునీల్ చవాన్ అధ్యక్షతన స్థానిక మండల కేంద్రంలో నిర్వహించారు. ఈసంద‌ర్భంగా జిల్లా అధ్యక్షులు సునీల్ చౌహాన్ మాట్లాడుతూ టెట్ సంబంధం లేకుండా ఉపాధ్యాయులందరికి పదోన్నతులు కల్పించాలని, టెట్ విషయంలో ఉపాధ్యాయులందరూ తీవ్ర గందరగోళంలో ఉన్నారన్నారు. ప్రభుత్వం వెంటనే టెట్ పైన స్పష్టత ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న డి ఎ లను, బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. అనంత‌రం తపస్ బజార్‌హ‌త్నూర్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది . అధ్యక్షులుగా సిర్పూర్ శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ మనోజ్ కుమార్, కోశాధికారిగా ఉయిక గంగాధర్, ఉపాధ్యక్షులుగా రాథోడ్ జ్ఞానేశ్వర్, మీడియా కన్వీనర్ రాథోడ్ అశ్విన్, కార్యదర్శులుగా చౌవాన్ సంతోష్,కోవ గంగారాం ఎన్నిక‌య్యారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సునీల్ చౌవాన్, ఆర్థిక కార్యదర్శి బచ్చువార్ నారాయణ, జిల్లా నాయకులు మేస్రం రాజకుమార్, బత్తుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *