సిరాన్యూస్, భైంసా
ఉపాధ్యాయురాలు శిరీషపై సస్పెన్షన్ ఎత్తివేయాలి:తపస్
జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు శిరీష సస్పెన్షన్ను ఎత్తివేయాలని తపస్ జిల్లా గౌరవ అధ్యక్షులు జి.రాజేశ్వర్ అన్నారు. మంగళవారం నిర్మల్జిల్లా భైంసా పట్టణంలో వారు మాట్లాడారు. జుట్టు పెంచుకొని పాఠశాలకు వచ్చిన విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్న ఖమ్మం జిల్లా పేరువంచ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు శిరీష పై వేటు వేయడం సరికాదన్నారు. విద్యార్థులను సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తున్న ఉపాధ్యాయులను శిక్షించడం సరికాదన్నారు.