సిరా న్యూస్,సంగారెడ్డి;
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పోలీసులు వాహనదారులను దారి మళ్లిస్తున్నారు. ఓఆర్ఆర్ రింగు రోడ్డు పరిసర ప్రాంతాలకు వాహనదారులను రానివ్వడంలేదు. డ్యూటీలు, స్కూళ్లకు వెళ్లే వారికి తిప్పలు తప్పలేదు. సభాస్థలికి ఐదు కిలో మీటర్ల మేర దూరంలో వాహనాల పార్కింగ్ చేస్తున్నారు. సభాస్థలికి వెళ్లే వారు ఐదు కిలో మీటర్ల నుంచి నడవాల్సీ వచ్చింది.