బోథ్, సిరా న్యూస్
ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
జాతీయ రహదారి భద్రతా మాసం సందర్భంగా బోథ్ పోలీసుల ఆధ్వర్యములో నాగభూషణం పాఠశాలలో విద్యార్థులకి ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రాములు మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయములో హెల్మెట్ తప్పని సరిగా ధరించాలన్నారు. 18 సంవత్సరాలు నిండని వారికి వాహనాలు ఇవ్వరాదన్నారు. రాంగ్ రూట్లో వెళ్ళకూడదని సూచించారు విద్యార్థులకు ట్రాఫిక్చా రూల్స్ పై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నాగభూషణం స్కూల్ కరస్పాండెంట్ కిషోర్ ,టీచర్స్ ప్రశాంత్, కిషన్, అజయ్ పాల్గొన్నారు