చెట్టు కొమ్మ పడి యువతికి గాయాలు
సిరా న్యూస్,తిరుమల;
తిరుమల కొండపై ఓ భక్తురాలిపై చెట్టు ఆకస్మాత్తుగా విరిగిపడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమల కొండపై ఉన్న జాపాలి హనుమాన్ ఆలయానికి ఆంజనేయ స్వామి దర్శనం కోసం నడుచుకుంటూ ఓ యువతి వెళ్తోంది. అయితే ఒక్కసారిగా సదరు యువతిపై భారీ చెట్టుకొమ్మ విరిగిపడింది. దాంతో యువతి తల, వెన్నుముకకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతికి చికిత్స అందిస్తున్నారు.
======================