ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో విషాదం..

చున్నీతో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య..
 సిరా న్యూస్,కడప;
కడప జిల్లా వేంపల్లి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో విషాదం జరిగింది.బాత్రూం లో వాటర్ లైన్ పైపుకు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మృతురాలు ప్రకాశం జిల్లా చీరాల కు చెందిన జమీషా ఖురేషి గా గుర్తించారు త్రిబుల్ ఐటీ అధికారులు. పోలీసులు మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం ఫైనల్ ఇయర్ కు చెందిన ఓ విద్యార్థిని మొబైల్ ఫోన్ క్యాంటీన్ వద్ద మిస్సింగ్ అయినది. మొబైల్ ఫోన్ ను మృతురాలు జమీషా ఖురేషి తీసుకున్న విషయాన్ని గుర్తించిన త్రిపుల్ ఐటీ అధికారులు ఆమెను మందలించారు. దీంతో మనస్థాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *