సిరాన్యూస్, చిగురుమామిడి
ప్రభుత్వ వసతి గృహాలను తనిఖీ చేసిన ట్రైనింగ్ కలెక్టర్ అజయ్ యాదవ్
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహం, కస్తూరి బాయ్ గాంధీ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం ట్రైనింగ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆకస్మిక తనిఖీ చేశారు .ఈ సందర్భంగా హాస్టల్స్ లలో విద్యార్థులకు కల్పిస్తున్న తాగునీరు, రోజు వారి భోజనాలు, దోమల నివారణకు కల్పిస్తున్న చర్యలు, క్రీడా సామాగ్రి మొదలైన మౌలిక వసతులను గురించి హాస్టల్స్ వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు,విద్యార్థుల హాజరు,రోజువారీ మెస్,పలు రికార్డులను పరిశీలించారు. హాస్టళ్లలో ఏవైనా మౌలిక సదుపాయాల సమస్యలు ఉంటే పై అధికారులకు తెలియపరిచాలన్నారు.ఈ సందర్భంగా వారివెంట చిగురుమామిడికి బదిలీపై వచ్చిన తహశీల్దార్ ఎం రమేష్,మం డల అభివృద్ధి అధికారి ఖాజా మొయినోద్దీ, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐలు సంతోష్ కుమార్, అరుణ్ కుమార్, ఎంపిఓ శ్రావణ్ కుమార్ తదితరులు ఉన్నారు.