సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అనేది చిన్న విషయం కాదు. సమాజంలో మీ సర్వీస్ ఇవ్వడానికి ముందుకు రావడం గర్వకారణమని జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్యా మిశ్రా అన్నారు. గురువారం నాడు చంచల్గూడ జైలు ఆవరణలో వార్డర్లకి శిక్షణా కార్యక్రమాన్నిఆమె ప్రారంభించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో వార్డర్లుగా 136 మంది ఎంపికయ్యారు. వారిలో 85 మంది జైళ్ళ శాఖ ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేసారు. వీరిలో ఏడుగురు మహిళా జైలు వార్డర్లు వున్నారు. వార్డర్లగా ఎంపికైన వారికి ఇటీవలే నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేసారు. వారందరకీ గరువారం నుంచి చంచల్గూడ జైల్లో నూతన వార్డర్లకి శిక్షణ ప్రారంభం అయింది.
సౌమ్యా మిశ్రా మాట్లాడుతూ దేశంలో తెలంగాణ జైళ్ళ శాఖకు ఎంతో పేరు ఉంది. ఆపేరును మరింత పెంపొందించడానికి మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను. శిక్షణలో మీ అందరిని వజ్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తాం. జైళ్ళకు వచ్చే ఖైదీలను కేవలం నేరస్తులుగానే కాకుండా మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజంలోకి పంపిస్తాము. ఖైదీలతో ఎక్కువగా గడిపేది వార్డర్లు మాత్రమే, అందుకే వాళ్ళని మానసికంగా, శారీరకంగా ఉండేందుకు శిక్షణ ఇస్తాము. ఇప్పటికే రెండు బ్యాచ్ ల వార్డర్ల శిక్షణ చేసి పంపించాం. ఇప్పుడు మూడో బ్యాచ్ శిక్షణకు వచ్చింది. ఈ శిక్షణ వార్డర్లకు అందరికీ పూర్తిస్థాయిలో ఉపకరిస్తుందని భావిస్తున్నామని అన్నారు.