శాటిలైట్ ఫోన్లపై టాస్క్ ఫోర్స్ అధికారులకు శిక్షణ

సిరా న్యూస్,విశాఖపట్నం;
టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ సమయంలో ఉపయోగించే శాటిలైట్ ఫోన్ల వినియోగం గురించి బీఎస్ ఎన్ ఎల్ అధికారులు శిక్షణ ఇచ్చే కార్యక్రమం సోమవారం జరిగింది. బీఎస్ ఎన్ ఎల్ ఏజీఎం లక్ష్మీ నారాయణ శాటిలైట్ ఫోన్ల పనితీరు గురించి వివరించారు. వాటిని ఎలా ఉపయోగించాలి, ఎలాంటి ప్రాంతాల్లో వినియోగించాలి, వాటి వలన కలిగే ప్రయోజనం గురించి విశదీకరించారు. దీనిపై కూబింగ్ చేపట్టే అధికారులతో గ్రూప్ డిస్కషన్ చేపట్టారు. కొన్ని కేస్ స్టడీలను తెలిపారు. తరువాత టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆపరేషనల్ టీమ్ లతో ఇంటరాక్ట్ అయ్యారు. శాటిలైట్ ఫోన్ల ద్వారా కమ్యూనికేషన్ ఎలా, ఎవరికి చేర వేయాలని తెలిపారు. దీనిద్వారా అత్యవసర సమయాల్లో మరో టీమ్ నుంచి సహకారం తీసుకునే వీలు ఉంటుందని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చెంచుబాబు, ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి, ఆర్ ఎస్ ఐలు, ఆపరేషన్ టీములు పాల్గొన్నారు.
=====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *