సిరా న్యూస్, కుందుర్పి
ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం రాగి వైరు చోరీ
కళ్యాణదుర్గం ఎర్రంపల్లి లో రైతు కొల్లి సత్యనారాయణ చౌదరి ( టీడీపీ నాయకుడు) తోటలోని ట్రాన్స్ఫార్మర్ను సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి రాగి వైరును అపహరించారు. ఎర్రంపల్లి , గరుడాపురం మధ్యలో వ్యవసాయ క్షేత్రంలో సిమెంట్ దిమ్మెపై ఉంచిన ట్రాన్స్ఫార్మర్కు కనెక్షన్ తప్పించి కిందకు తోచేసి, పగులగొట్టి అందులోని రాగి తీగలు ఎత్తుకెళ్లారు. బాధిత రైతు సత్యనారాయణ కళ్యాణదుర్గం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.ఇటీవల కాలంలో ట్రాన్స్ఫార్మర్ లోపల ఉన్న రాగి తీగలను ఎత్తుకెళ్లే దుండగులు అధికమయ్యారని పోలీసులు నిఘా ఉంచి దొంగలను పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు.