వణుకుతున్న అలుమూరు,

ఆసుపత్రి కి రోగులు పరుగులు
సిరా న్యూస్,కోవూరు;
పశ్చిమ గోదావరి పెనుమంట్ర మండలంలోని పలు గ్రామాల్లో జ్వరాలు, జలుబు, దగ్గు తదితర రుగ్మ తలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రక్తఫలకాలు క్షీణించి ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఆలమూరు గ్రామంలో ఈ సమస్య మరీ తీవ్రంగా కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో స్థానిక, సమీప పట్టణ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామం నుంచి వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన వారిలో 11 మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి ప్లేట్ లెట్లు భారీగా క్షీణించినట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. సుమారు నెల రోజుల కిందట కురిసిన వర్షాలకు స్థానిక ఎస్సీ ప్రాంతంలో నీరు నిలిచి మురుగు నీరు జత కలవడంతో పారిశుద్ధ్య సమస్య తలెత్తింది. ఈ సమయంలో ప్రారంభమైన అనారోగ్య సమస్యలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.
ఇటీవల కురిసిన వర్షాలతో సమస్య మరీ జటిలంగా మారింది. స్థానికంగా వైద్య శాఖ చేసిన పరీక్షల్లో డెంగీ కేసును గుర్తించగా వైద్యం చేయించుకొని కోలుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే జ్వరాల కేసులు పెరగడం, విపరీతమైన నీరసంతో బాదపడుతున్న వారు ఎక్కువగా వె ఉన్నారు. దీంతో భయపడి ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు వెచ్చించి వైద్యం పొంది బయట పడుతున్నారు. స్థానికంగా ఆదివారం ఒక్కరు మృతి చెందడంతో ప్రజల్లో మరింత భయం వ్యక్తమవుతోంది. తొలుత పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం చేసిన పంచాయతీ ఆ తర్వాత పరుగులు పెట్టింది. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఇక్కడి మురుగు సమస్యపై మండల పరిషత్తు సమావేశంలోనూ చర్చకు వచ్చింది. ప్రస్తుతం వైద్య శాఖ అధికారులు ఇంటింటా సర్వేతోపాటు వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *