సిరా న్యూస్,సికింద్రాబాద్;
సికింద్రాబాద్ వెంకటాపురం లోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న ప్రజా గాయకుడు గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గద్దర్ భార్య గుమ్మడి విమల భట్టి విక్రమార్కను చూసి కంట తడి పెట్టుకొని భావోద్వేగానికి గురైయారు. ఆమెను భట్టి విక్రమార్క ఒదార్చారు. గద్దర్ అన్న కుటుంబానికి మేమంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. గద్దర్ జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గద్దర్ భార్య గుమ్మడి విమల, కుమారుడు సూర్యం, కుమార్తె వెన్నెల లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం ఇచ్చారు. భట్టి విక్రమార్క వెంట ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తదితరులున్నారు.