సిరా న్యూస్,సంగారెడ్డి;
జహీరాబాద్ మండలం కొత్తూరు.బి గ్రామంలోని ట్రైడెంట్ పరిశ్రమ వేలానికి రంగం సిద్ధం సిద్దమయింది. ఆగస్టు 14న వేలం వేస్తున్నట్టు తహసిల్దార్ రవిందర్ ప్రకటన విడుదల చేసారు. 1970లో నిజాం చక్కెర కర్మాగారం అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో ప్రైవేటుకు విక్రయించింది ప్రభుత్వం . రెండేళ్ల క్రితం ట్రైడెంట్ చక్కర పరిశ్రమ మూతపడింది. కార్మికులకు ఏడుకోట్ల వేతనాల బకాయిలు, రైతులకు, బ్యాంకు రుణం 25 కోట్ల బకాయిలు వున్నాయి. ఆర్ఆర్ యాక్టు వేలం వేస్తున్నట్లు తహసిల్దార్ ప్రకటించారు. ఈ నేపధ్యంలో చెరుకు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే జహీరాబాద్ ప్రాంతంలో సాగు భారీగా తగ్గింది.