సిరా న్యూస్,డోర్నకల్;
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మునిసిపాలిటీ కేంద్రంలో పోలీస్,మునిసిపాలిటీ అధికారుల ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ట్రాపిక్ నియంత్రణ చర్యలను చేపట్టారు. ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై రోడ్డు కు ఇరువైపులా వాహనాలు, తోపుడు బండ్ల ను ఉంచడం తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టినట్టు వివరించారు. వాహనదారులు ట్రాపిక్ నింబంధనలను పాటించాలని లేనట్లయితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.