TS Budget: బడ్జెట్ లో రెడ్డిలకు మొండి చేయి…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

బడ్జెట్ లో రెడ్డిలకు మొండి చేయి…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో రెడ్డిలకు మొండిచేయి దక్కిందని రెడ్డి ఐక్య వేదిక యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్యాతం శివప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని దుయ్యబట్టారు. రెడ్డిలకు సరిపడా నిధులతో ప్రత్యేక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికీ రెడ్డి సామాజిక వర్గంలో అనేకమంది నిరుపేదలు పక్క ఇండ్లు, వ్యవసాయ భూములు లేక అత్యంత దయనీయ స్థితిలో జీవితం గడుపుతున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెడ్డిలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక గురుకులాలు సైతం స్థాపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మరో మిలియన్ మార్చ్ తరహా ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *