Tula Srinivas: కాంగ్రెస్ చేతకానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కింది

సిరాన్యూస్,బోథ్‌
కాంగ్రెస్ చేతకానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కింది
* బోథ్‌ మండల అధ్యక్షులు తుల శ్రీనివాస్
* ఆత్రం సక్కు గెలుపు ఖాయం

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రజలకు చేతకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన అనంతరం వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని బోథ్‌ మండల అధ్యక్షులు తుల శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పాట్నాపూర్, మర్లపల్లి, గురుదేవ నగర్, ఇన్కర్ పల్లె గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ప్రచారానికి వచ్చినపుడు నిలదీయాలని సూచించారు. ఆయా గ్రామాల పార్టీ కార్యకర్తలకు ఓటర్లకు విన్నవించారు. నాలుగు నెలల పాలన అనంతరం ప్రజలు బిఆర్ఎస్ పార్టీ వైపు ఆసక్తి చూపుతున్నారన్నారు. బీఆర్ ఎస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఆత్రం సక్కు గెలుపు ఖాయమని పేర్కొన్నారు . ప్రచార కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు పందరం సుగుణ, శంకర్ కొమ్ము, చంద్రమోహన్ బాబు సింగ్, దేవేందర్ సురేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *