Tula Srinivas:అందరి సహకారంతో మండ‌లం అభివృద్ది : బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్

సిరాన్యూస్, బోథ్‌
అందరి సహకారంతో మండ‌లం అభివృద్ది : బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్
* ప్రజా సంక్షేమం కోసం పాటుప‌డుతా

అందరి సహకారంతో మండలాన్ని అభివృద్ధిలో ముందు ఉంచామ‌ని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ‌ల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. తాను ఎంపీపీ ఆ పదవిలో ఉన్నంతకాలం మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశానని తెలిపారు. మండలానికి రెండు కోట్ల 17 లక్షల రూపాయల తో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.తాను తన శక్తి మేరకు గ్రామాల్లో రోడ్లు తాగునీరు పాఠశాలల మరమ్మతులు, అంగన్వాడి సెంటర్ల నిర్మాణం చేయించడం జరిగిందన్నారు. తాను తీసుకువచ్చిన నిధులతో పనులు జరిగేందుకు ఆయా గ్రాముల ప్రజాప్రతినిధులు, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు స‌హ‌కారం అందించారన్నారు. నాపై ఉన్న అభిమానంతో రాష్ట్ర‌స్థాయిలో ఉన్న మంత్రులు సైతం అడగగానే నిధులు ఇచ్చారని వివరించారు. పదవిలో ఉన్నా లేకున్నా తాను ప్రజల వెంటే ఉంటానని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడతానన్నారు. గతంలో మాదిరిగానే ఏవైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు నా దృష్టి తీసుకురావాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *