సిరా న్యూస్, సోనాల:
టియూటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ…
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం టియుటిఎఫ్ 2024 క్యాలెండర్ ను ఎంపీడీఓ సుశీల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టియుటిఎఫ్ బోథ్ మండల అధ్యక్షులు బైరి సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎప్పుడు ముందు వరసలో ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలున్నా, తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే వాటి పరిష్కారం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా మండల ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టియుటిఎఫ్ బోథ్ మండల ప్రధాన కార్యదర్శి అప్పాల శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేష్ వైద్య, జిల్లా ఆర్థిక కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, బోథ్ మండల సహాధ్యక్షులు ఈద్గామ్ రాజేశ్వర్, నాయకులు మోహన్ రెడ్డి, రమేష్ చందర్, గంగాసాగర్, లక్ష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.