సిరా న్యూస్,విశాఖపట్నం;
ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని కాంబోడియాకు తరలించగా వారిలో 68 మందిని వెనక్కి తీసుకొచ్చి నట్లు విశాఖ సీపీ రవిశంకర్ అయ్య న్నార్ తెలిపారు. ఈ వ్యవహారంలో 21 మంది ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించామ న్నారు. ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశామన్నారు. భారతీయులు లక్ష్యం గా ఏపీవాసులతో సైబర్ క్రైమ్లు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో 90 మందిని కాంబోడియా నుంచి తీసుకు రావాల్సి ఉందని వెల్లడించారు.