కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు

సిరా న్యూస్,వెంకటగిరి;
వెంకటగిరి రూరల్ మండల పరిధిలోని పంజాం హరిజన వాడలో వీధి కుక్కల దాడిలో మానస (9), మాలతి (10) ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీధి కుక్కల దాడిలో మరో నలుగురికి గాయాలయ్యాయి. కుక్కలు దాడిలో తీవ్రంగా గాయపడిన మానస, మాలతి లని వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనలతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి కి తరలించారు. ఇప్పటికైనా పట్టణాల్లో గ్రామాల్లో కుక్కల బెడదను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సామాన్యులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *