ఇద్దరుకార్పోరేటర్లు వైకాపా రాజీనామా

 సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి నగర పాలక కార్పొరేషన్లలో సంధ్య 49, అనిత 48వ డివిజన్ కార్పొరేటర్లు వైకాపా పార్టీ సభ్యత్వానికి స్వస్తి పలికారు. తమపై బురదజల్లే యత్నం చేయడం దారుణం దారుణమని మీడియా ముందు తిట్టి ఫోన్ లో కాళ్ళు పట్టుకోవడం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కి తగదన్నారు. ఎమ్మెల్యేగా కరుణాకరరెడ్డి గెలుపు కోసం మేము ఎంతో కష్టపడి పని చేశామని, డివిజన్ లో ఏ కార్యక్రమం చేపట్టినా కనీసం సమాచారం ఇవ్వడం లేదని అవేదన వ్యక్తం చేసారు. మా పరిధిలోనే కాదు తిరుపతి మొత్తం భూ కబ్జాలు జరుగుతున్నాయని అన్నారు.
అన్నా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ నా పై పీడీ యాక్టు పెడితే భూమన కరుణాకరరెడ్డి నన్ను కాపాడినట్లు భవిష్యత్తు ఇచ్చినట్లు చెప్పడం దారుణమని అన్నారు. నాపై తప్పుడు కేసు పెట్టినప్పుడు చంద్రబాబు చొరవతో కేసు కొట్టేశారని మేయర్ పదవి మేము కోరలేదు. పార్టీలో చేరమని నన్ను నా ఇంటికి వచ్చి భూమన వాగ్ధానం చేశారు. మాకు ఇస్తామని చెప్పి మాట మార్చినా మేము ఇప్పటివరకు అడగలేదన్నారు. జిల్లా కు చెందిన వ్యక్తిని.. ఆరేళ్ల వయస్సు నుంచి తిరుపతిలో ఉన్నామన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *