సిరా న్యూస్,మెదక్;
హావేలి ఘనపూర్ (మం) శంనాపూర్ లో విషాదం నెలకొంది. గ్రామంలో పిడుగుపాటుతో ఇద్దరు మృతి చెందారు. బుధవారం సాయంత్రం పొయ్యిలో కట్టెల కోసం సిద్దయ్య (50), నందు (22) అడవికి వెళ్లారు. రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో రాత్రంతా గ్రామస్తులు వెతికారు. మల్లన్నగుట్ట ప్రాంతంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందినట్టు గుర్తించారు.
====