సిరా న్యూస్,కరీంనగర్;
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు లో బుధవారం తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కరీంనగర్ నుండి విజయవాడ వెళుతున్న కారును టిప్పర్ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ పట్టణం లోని కోతి రాంపూర్ కు చెందిన కోమురమ్మ, ప్రభాకర్, సదానందం, గీత అనే నలుగురు విజయవాడలో లారీ కొని తీసుకొనిరావడానికి వెళుతున్న క్రమం లో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న కోమురమ్మ, ప్రభాకర్ అక్కడిక్కడే మృతి చెందగా గీత పరిస్థితి విషమం గా ఉండడం తో వరంగల్ కు తరలించారు. సదానందానికి స్వల్ప గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారిలో తల్లి కొమురమ్మ కొడుకు సదానందం కూతురు గీత కాగా మృతి చెందిన ప్రభాకర్ బంధువు గా తెలుస్తోంది.