సిరా న్యూస్,సికింద్రాబాద్;
మారేడ్పల్లి ఎమ్మార్వో పద్మ సుందరితోపాటు మరో ఇద్దరు ఉద్యోగులను కలెక్టర్ అనుదీప్ సస్పెండ్ చేసారు. బుధవారం నాడు కలెక్టర్ ఆకస్మిక తనిఖీకి వచ్చారు. కార్యాలయంలో ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసారు. రికార్డులు పరిశీలించి, ప్రభుత్వ భూములపై ఆరా తీసారు. సిబ్బంది అందుబాటులో లేకపోవడం, సరిగ్గా రికార్డులు మైంటైన్ చేయకపోవడంతో ఎమ్మార్వో తో పాటు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసారు.