ఆ గ్రామంలో ఇద్దరు మృతి

సిరా న్యూస్,ఆసిఫాబాద్;
కౌటాల మండలంలోని గుండాయిపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పదో తరగతి విద్యార్ధిని పూజ జ్వరంతో శనివారం సాయంత్రం మృతిచెందగా ఆమె మృతదేహం ఇంటికి చేరేలోపే గ్రామంలో మరో దుర్ఘటన చోటుచేసు కుంది. బోయేర్ కాళిదాస్ (30) మంచిర్యాలలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఇద్దరి మృతదేహాలు గ్రామానికి చేరుకోవడంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు, బంధువులు, గ్రామస్థుల రోదనలతో ఊరంతా కన్నీరుమున్నీరుగా విలపించింది.
గుండాయిపేటను రెండు నెలలుగా జ్వరాలు వదలడం లేదు. తగ్గినట్లే తగ్గి మళ్లీ ప్రబలుతున్నాయి. డెంగీ, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్న బాధితులకు ప్రభుత్వ వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. దీంతో బాధితులు స్థానిక వైద్యులను ఆశ్రయిస్తున్నారు. పరిస్థితి చేయిదాటాకే ఇతర ఆసుపత్రుల బాట పట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. నాన్నా.. నన్ను కాపాడు’.. అన్న పూజ మాటలు ఆ తండ్రి గుండెలను కలిచి వేస్తోంది. ఆ మాటలు అన్న కాసేపటికే.. పూజ మృతి చెందడంతో ఆ తండ్రి విలవిల లాడిపోతున్నాడు.ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేటకు చెందిన పూజ (16) సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో టెన్త్ చదువుతోంది. వారం క్రితం తండ్రికి ఫోన్ చేసి ‘జ్వరమొచ్చింది. కాళ్లూ చేతులు గుంజుతున్నాయ్ నాన్నా. ఇంటికి తీసుకుపో’ అని చెప్పింది. తండ్రి వివిధ ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా తగ్గలేదు. శనివారం హైదరాబాద్ కు తరలిస్తుండగా ‘నాన్నా.. నన్ను కాపాడు’ అంటూ తండ్రి చేయి పట్టుకుని వేడుకుంది. అయినా దేవుడు కరుణించలేదు. కాసేపటికే ప్రాణాలు వదిలింది. దీంతో ఆ తండ్రి తీవ్ర మనోవేదనకు గురయ్యడు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *