అగ్ని ప్రమాదంలో రెండు పూరిల్లు దగ్దం..మహిళ సజీవదహనం

సిరా న్యూస్,అవనిగడ్డ;
అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో దారుణం జరిగింది. గురువారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పు అంటుకుని మహిళ సజీవ దహనం అయింది. మోపిదేవి ఎస్టీ కాలనీలో అర్ధరాత్రి ప్రమాదవశాత్తు రెండు పూరిల్లు దగ్దమయ్యాయి. ఒక ఇంటిలో నిద్రిస్తున్న కందుల సీతామహాలక్ష్మి (70) మంటలు అంటుకుని సజీవ దహనం అయింది.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *