సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల జిల్లా, ఆత్మకూరు పరిధిలో రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆత్మకూరు మండలం, నల్లమల అడవి ప్రాంతంలోని బైర్లుటి సమీపంలో మోటార్ సైకిల్ పై వెళ్తున్న ఓ వ్యక్తి ని బొలెరో వాహనం ఢీకొనగా బైక్ పై వెళుతున్న ఉగన్న అనే 32 సంవత్సరాల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి కరివేన గ్రామ సమీపంలో బైక్ పై వెళుతుండగా అదుపుతప్పి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. బైర్లుటి దగ్గర మృతి చెందిన వ్యక్తి కర్నూలు జిల్లా కల్లూరు మండలం పందిపాడు వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనాలపై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు