సిరా న్యూస్,రంగారెడ్డి;
రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసారు. జల్సాలకు అలవాటు పడి తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ షేక్ అమీర్, షేక్ ఫెరోజ్, ఆమీర్ అనే ముగ్గురు నిందితులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిలో ఇద్దరిని అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. ఈనెల 13వ తారీఖున మీర్పేట్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో వీరిని అరెస్టు చేశారు. వీరి నుండి 6,80,000 నగదును రికవరీ చేశారు. గతంలో వీరి పైన సుమారుగా 20 కి పైగా కేసును నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు.
వీరిపైన తెలంగాణతోపాటు మహారాష్ట్రలోనూ పలు కేసులు నమోదు అయ్యాయని సమాచారం.