సిరా న్యూస్,తిరుమల;
తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. మృతురాలు గుంటూరు జిల్లా మాచర్ల ఎర్రగడ వీధికి చెందిన దాసరి జ్యోతి మహి గా పోలీసులు గుర్తించారు. తిరుమల నుండి తిరుపతికి ద్విచక్ర వాహనంలో త్రిబుల్ రైడింగ్ వస్తుండగా 16 మలుపు వద్ద బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన జ్యోతిని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని స్విమ్స్ ఆసుపత్రి నుండి రుయా మార్చురీకి తరలించారు.