గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్ట్

సిరా న్యూస్,కుప్పం;
ఆంధ్ర నుండి తమిళనాడుకు సుమారు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే 12 కేజీల గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులో తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్న కుప్పం ఎస్.ఇ. బి పోలీసులు..కుప్పం ఎస్.ఈ.బి సి.ఐ సమాచారం మేరకు కాకినాడ నుండి గంజాయి తీసుకువచ్చిన బాకూరి లోవలక్ష్మి 27 అనే మహిళను తమిళనాడు క్రిష్ణగిరికి చెందిన మల్లిక 55 కుప్పం నుండి క్రిష్ణగిరికి తీసుకుని వెళ్లడానికి రావడం జరిగింది. అందిన సమాచారం మేరకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను కుప్పం రైల్వే స్టేషన్ లో అదుపులో తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *