ఐపీసీ పార్టీ జాతీయ అధ్యక్షులు కె.బి.శ్రీధర్
సిరా న్యూస్,హైదరాబాద్;
ఐపీసీ పార్టీ మల్కాజిరి ఎంపీ అభ్యర్థిగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, వికలాంగ్ జంగ్ విభాగం జాతీయ అధ్యక్షురాలు శివలంక నాగ ఉదయలక్ష్మిని బరిలో నిలువుతున్నట్లు ఐపీసీ పార్టీ జాతీయ అధ్యక్షులు కెబి. శ్రీధర్ ప్రకటించారు. ఆబిడ్స్ లోని పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ.. మాతృప్రేమతో పరిపాలన తమ పార్టీ లక్ష్యం అన్నారు. ఉదయలక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలనిఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు.. అనంతరం ఉదయలక్ష్మీ మాట్లాడుతూ.. భారత రాజకీయ పార్టీ చరిత్రలో ఏ పార్టీ కూడా దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పించలేదని అన్నారు. దివ్యాంగులకు కేవలం పెన్షన్లు మాత్రమే ఇస్తేసరిపోదు అన్నారు. తనను గెలిపిస్తే అత్యంత సామాజిక బలహీన వర్గమైన దివ్యాంగులను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామన్నారు. వికలాంగులం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతాం అన్నారు. ఈ సమావేశంలోపార్టీ నాయకులు పార్టీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి వాసుదేవ రావు, నల్లగొండ జిల్లా అద్యక్షులు నేమాని భాస్కర్ నేత, యాదవ్, ఆఫీస్ ఇంచర్గే కొండల్ రావు, పిఅర్ఓ సరిత, నవీనరాణి, ఆవుల అల్లాజీ నాగభూషణంపాల్గొన్నారు.