సిరా న్యూస్, కళ్యాణదుర్గం
చంద్రబాబును కలిసిన ఉమా మహేశ్వర నాయుడు
* కళ్యాణదుర్గం, పెనుకొండ నియోజకవర్గాలపై పునరాలోచన
టీడీపీ అధినేత చంద్రబాబును కళ్యాణదుర్గం ఇంచార్జి మాదినేని ఉమా మహేశ్వర నాయుడు గురువారం కలిశారు. ఈసందర్భంగా అధినేత తో పలు విషయాలు చేర్చించి బోరున విలపించారు. ప్రజా వ్యతిరేకత గురించి ఉమా మహేశ్వర నాయుడు తెలియజేశారు. అన్ని పరిగణలోకి తీసుకుంటానని, ప్రజా అభిప్రాయం ప్రకారమే ముందుకు వెళ్ధామని చెప్పారు. పార్టీ కి కోసం కష్టపడ్డావు… ప్రజలలోనే ఉండు.. అనివార్య కార్యాల వల్ల ప్రజాభిప్రాయం మారితే ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదని టీడీపీ అధినేత తేల్చి చెప్పారు. కళ్యాణదుర్గం, పెనుకొండ నియోజకవర్గాలను పునరాలోచన చేస్తామని అధినేత తెలియజేయడం జరిగింది.