సిరాన్యూస్, కుందుర్పి
తలారి రంగయ్యను అఖండ మెజార్టీతో గెలిపిద్దాం: ఉమామహేశ్వర నాయుడు
కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్య అఖండ మెజార్టీతో గెలిపించుకుం అని కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు అన్నారు.అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం, కంబదూరుగుద్దేళ్ళ, మరిమాకులపల్లి, కదిరిదేవరపల్లి, ఓబుగానిపల్లి, జక్కిరెడ్డి పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ ఎటువంటి అవినీతి మరకలు లేకుండా రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం చేసి ఐదు సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన తలారి రంగయ్యని గెలిపించుకొని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకుని మన ప్రాంతన్ని అభివృద్ధి వేసుకుందామని తెలియజేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి సురేంద్రబాబు మన ప్రాంత మనోభావాల గురించి ఎటువంటి అవగాహన లేకుండా టికెట్ కొనుక్కొని ఎమ్మెల్యేగా పోటీ చేసి లీడర్లను కొనుగోలు చేసి అసాంఘిక కార్యక్రమాలు నడిపేవారు ఏ విధంగా అయితే డేరాలు వేసుకొని ఉంటారో ఆ విధంగా కళ్యాణదుర్గం పట్టణం ఊరి బయట డేరా వేసుకుని కొనుగోలు చేసిన లీడర్లు అందర్నీ అందులోకి తోలుతున్నాడని ఎద్దేవా చేశారు. ఈనెల 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తలారి రంగయ్యని అఖండమైన మెజారిటీతో గెలిపించి కళ్యాణదుర్గం ప్రాంత గౌరవాన్ని కాపాడుకుందాం అని తెలియజేశారు. కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.